నిధులు మంజూరు చేయండి
ABN , First Publish Date - 2021-06-17T06:00:13+05:30 IST
నగరి నియోజక వర్గంలోని నగరి, విజయపురం మండలాలలో ఇరిగేషన్ పనులకు సంబంధించి వంద కోట్ల అంచనాలతో తయారు చేసిన పధకాలకు నిధులను మంజూరు చేయాలని నగరి ఎమ్మెల్యే రోజా బుధవారం మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డిని కోరారు.
మంత్రి బుగ్గనకు రోజా వినతి
పుత్తూరు, జూన్ 16: నగరి నియోజక వర్గంలోని నగరి, విజయపురం మండలాలలో ఇరిగేషన్ పనులకు సంబంధించి వంద కోట్ల అంచనాలతో తయారు చేసిన పధకాలకు నిధులను మంజూరు చేయాలని నగరి ఎమ్మెల్యే రోజా బుధవారం మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డిని కోరారు. నగరిలో మొక్కలకండ్రిగ వద్ద కుశస్దలీకి కొత్త ట్యాంక్కు, విజయపురంలో బుగ్గ ఆనకట్టకింద మంగళం సప్లయి ఛానళ్లకు నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి తాడేపల్లిగూడెంలో కలిసి రోజాదంపతులు శుభాకాంక్షలు తెలిపారు.