అప్పన్న స్వామికి ఘనంగా గరుడసేవ

ABN , First Publish Date - 2021-12-08T05:19:06+05:30 IST

వరాహ లక్ష్మీనృసింహస్వామికి మంగళవారం ఘనంగా గరుడసేవ నిర్వహించారు.

అప్పన్న స్వామికి ఘనంగా గరుడసేవ
గరుడసేవలో పాల్గొన్న భక్తులు

సింహాచలం, డిసెంబరు 7: వరాహ లక్ష్మీనృసింహస్వామికి మంగళవారం ఘనంగా గరుడసేవ నిర్వహించారు. ఆర్జిత సేవల్లో భాగంగా మంగళవారం స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఆలయ కళ్యాణ మండపంలో రజిత గరుడ వాహనంపై అధిష్టింపజేశారు. ఇన్‌చార్జి ప్రధానార్చకుడు ఐవీ రమణాచార్యులు భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి షోడశోపచారాలు సమర్పించారు. నృసింహ అష్టోత్తర శతనామావళితో పూజలు చేశారు. గరుడ వాహనం చుట్టూ భక్తులు ముమ్మార్లు ప్రదక్షిణలు చేశారు. చేశారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు. అంతకుముందుస్వామివారి నిత్య కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.


Updated Date - 2021-12-08T05:19:06+05:30 IST