హరితహారాన్ని విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2020-07-02T11:23:04+05:30 IST

ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చే యాలని జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అధికారులను కోరారు

హరితహారాన్ని విజయవంతం చేయాలి

జడ్పీ స్థాయీ సంఘ సమావేశంలో చైర్మన్‌ విఠల్‌రావు


ఖిల్లా, జూలై 1: ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చే యాలని జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అధికారులను  కోరారు. బుధవారం విద్యా, వైద్యం, మహిళా శిశుసంక్షేమం స్థాయీ సంఘ సమావేశాలు జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ పాఠశాలల్లో  నిర్ణయించిన టార్గెట్‌కు అనుగుణంగా మొక్కలు నాటాలన్నారు. డీ ఈవో ఫోన్‌ చేస్తే స్పందించడం లేదని జడ్పీటీసీ సభ్యులు చైర్మన్‌ దృష్టికి తీసుకురాగా మరోసారి ఇలా జరగకుండా చూడాలని, సభ్యుల ఫోన్‌ నెంబర్‌లు ఉంచుకోవాలని డీఈవోకు సూచించారు. సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని పీహెచ్‌సీలలో పాము, తేలు కాటు మందులు అందుబాటులో ఉంచాలని చైర్మన్‌ ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ సెంటర్‌ల వద్ద మొక్కలు నాటాలని అన్నారు. అంగన్‌వాడీ పిల్లలకు ఇబ్బంది లేకుండా తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం గ్రామపంచాయతీ ద్వారా కల్పించాలని అన్నారు. సమావేశంలో జడ్పీటీసీలు సుమనారెడ్డి, భారతి, గంగాధర్‌, శంకర్‌, లావణ్య, యమున, కమల, రాజేశ్వర్‌, సీఈవో గోవింద్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-02T11:23:04+05:30 IST