పెళ్లయిన 72 గంటలకే కరోనాతో వరుడు మృతి
ABN , First Publish Date - 2021-05-01T11:14:23+05:30 IST
యూపీలోని బిజ్నౌర్లో విషాద ఘటన...
బిజ్నౌర్: యూపీలోని బిజ్నౌర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లయిన 72 గంటల వ్యవధిలోనే వరుని ఆనందాన్ని కరోనా లాగేసుకుంది. కరోనా కారణంగా వరుడు పెళ్లయిన రెండు రోజులకే కన్నుమూశాడు. పెళ్లయిన అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న వరుడిని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. వివరాల్లోకి వెళితే బిజ్నౌర్కు చెందిన అర్జున్కు ఏప్రిల్ 25న చాంద్పూర్కు చెందిన బబ్లీతో వివాహం జరిగింది.
పెళ్లి తంతు అంతా పూర్తయ్యాక రాత్రి 7 గంటల సమయంలో అప్పగింతల కార్యక్రమం కూడా పూర్తయ్యింది. ఊరేగింపుగా వధూవరులు వరుని ఇంటికి చేరుకున్నారు. అయితే ఇంతలోనే వరుడు అర్జున్కు అనారోగ్యం వాటిల్లింది. వెంటనే అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అర్జున్కు కోవిడ్-19 వార్డుకు తరలించారు. అయితే అక్కడ అతని ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. ఆసుపత్రిలో ఆక్సిజన్ అందుబాటులో లేనికారణంగా వరుడు కన్నుమూశాడు. ఈ విషయం తెలియగానే బంధువులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఇంతలో వధువు అనారోగ్యం పాలయ్యింది. వెంటనే ఆమెకు కరోనా టెస్టులు చేయించారు. అయితే ఆమెకు కరోనా నెగిటివ్ రిపోర్టు వచ్చింది.