చంద్రబాబుపై పెరుగుతున్న విశ్వాసం

ABN , First Publish Date - 2021-10-18T04:47:03+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంపై ప్రజల్లో రోజురోజుకూ విశ్వాసం పెరుగుతోందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు.

చంద్రబాబుపై పెరుగుతున్న విశ్వాసం
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి


వైసీపీ విధానాలను ఎండగట్టండి : కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పిలుపు

గిద్దలూరు, అక్టోబరు 17 : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంపై ప్రజల్లో రోజురోజుకూ విశ్వాసం పెరుగుతోందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. మండలంలోని లింగాపురం గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో అశోక్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. వైసీపీ కల్లబొల్లి మాటలతో కబుర్లు చెప్తుందన్నారు. రాష్ట్రాభివృద్ధి గాలికొదిలేశారన్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో సమస్యలతో ప్రజల సతమతమవుతున్నారని అశోక్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పథకాల పేరుతో పేదలను రోడ్లపై తిప్పుతున్నారని, అనేక మందికి కొర్రీలు చూపించి పథకాలను కట్‌ చేస్తున్నారని ధ్వజమెత్తారు.  వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడు తూనే ప్రజా సమస్యల పరిష్కారానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో లింగాపురం టీడీపీ నాయకులు బైలడుగు బాలయ్య, టీడీపీ మండల అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి, టీడీపీ గిద్దలూరు పట్టణ  అధ్యక్షుడు షాన్షావలి,  నాయకులు పఠాన్‌ హుస్సేన్‌ఖాన్‌, మౌళాలి, గోపాల్‌రెడ్డి, పెద్దబాషా పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-18T04:47:03+05:30 IST