స్వర్ణాంధ్ర రాంబాబుకు లయన్స్‌ అంతర్జాతీయ పురస్కారం

ABN , First Publish Date - 2021-07-22T06:47:20+05:30 IST

రాజమహేంద్రవరం స్వచ్ఛంధ సంస్థ నిర్వాహకుడు, లయన్స్‌ క్లబ్‌ రాజమహేంద్రవ రం రీజియన్‌ చైర్మన్‌ డాక్టర్‌ గుబ్బల రాంబాబుకు అంతర్జాతీ య సేవా పురస్కారం లభించిం ది. రాజమహేంద్రవరం మంజీర హోటల్‌లో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో లయన్స్‌ ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌ వి.విజయ్‌ కుమార్‌రాజు ఈ పురస్కారాన్ని రాంబాబుకు అందజేశారు.

స్వర్ణాంధ్ర రాంబాబుకు లయన్స్‌ అంతర్జాతీయ పురస్కారం
అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకుంటున్న గుబ్బల రాంబాబు

రాజమహేంద్రవరం సిటీ, జూలై 21: రాజమహేంద్రవరం స్వచ్ఛంధ సంస్థ నిర్వాహకుడు, లయన్స్‌ క్లబ్‌ రాజమహేంద్రవ రం రీజియన్‌ చైర్మన్‌ డాక్టర్‌ గుబ్బల రాంబాబుకు అంతర్జాతీ య సేవా పురస్కారం లభించిం ది. రాజమహేంద్రవరం మంజీర హోటల్‌లో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో లయన్స్‌ ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌ వి.విజయ్‌ కుమార్‌రాజు ఈ పురస్కారాన్ని రాంబాబుకు అందజేశారు. లయన్స్‌ క్లబ్‌ సభ్యుడిగా, స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో కొవిడ్‌-19 కష్టకాలంలో మొదటిదశలో 200 రోజులు రెండోదశలో 82 రోజులు విశేషమైన సేవలందించి లయన్స్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచారని ఈ సేవల ఉన్నత శిఖరాలకు గుర్తింపుగా లయన్స్‌ అంతర్జాతీయ పురస్కారాన్ని అందించినట్లు విజయకుమార్‌రాజ్‌ తెలిపారు. లయన్స్‌ పూర్వపు గవర్నర్‌ బీవీఎన్‌ రెడ్డి, గ్రంథి వెంకటేశ్వరరావు మాట్లాతుడూ రాంబాబు సేవలు ఎనలేనివన్నారు. లయన్స్‌ 316బీ ఉపగవర్నర్‌ మాటూరి మంగతాయారు, లయన్‌ బి.భరణి తాతేశ్వర్‌ పాల్గొన్నారు. రాంబాబుకు అంతర్జాతీయ పురస్కారం రావడంపట్ల స్వర్ణాంధ్ర గౌరవ అధ్యక్షుడు, సినీ హీరో సుమన్‌, ప్రముఖులు సీపీ రెడ్డి, తుమ్మిడి అరుణ్‌కుమార్‌, రుంకాని వెంకటేశ్వరరావు, ఏలిపే శ్రీనివాస్‌ అభినందనలు తెలిపారు.

Updated Date - 2021-07-22T06:47:20+05:30 IST