8500 గుట్కా ప్యాకెట్లు పట్టివేత
ABN , First Publish Date - 2021-02-28T03:46:22+05:30 IST
నాయుడుపేట పట్టణంలోని రెండు ప్రాంతాల్లో సుమారు రూ 80 వేలకు పైగా విలువ చేసే గుట్కా పాకెట్టు పట్టుకున్నట్లు ఎస్ఈబీ సీఐ జలీల్ అహ్మద్ వెల్లడించారు
వివరాలు వెల్లడించిన ఎస్ఈబీ సీఐ
నాయుడుపేట టౌన్, ఫిబ్రవరి 27 : నాయుడుపేట పట్టణంలోని రెండు ప్రాంతాల్లో సుమారు రూ 80 వేలకు పైగా విలువ చేసే గుట్కా పాకెట్టు పట్టుకున్నట్లు ఎస్ఈబీ సీఐ జలీల్ అహ్మద్ వెల్లడించారు. పట్టణంలోని ఎస్ఈబీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. పట్టణంలోని బజారువీధిలో నివాసం ఉంటున్న రవికుమార్ నుంచి 2,700, భరత్నగర్ నివాసి కృష్ణ నుంచి 5,800 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఎస్ఈబీ ఎస్ఐ శేషమ్మ, కానిస్టేబుళ్లు పుట్టయ్య, సురేష్, భాస్కర్, పవన్కళ్యాణ్లను సీఐ ప్రత్యేకంగా అభినందించారు.