పెందుర్తిలో జీవీఎంసీ కమిషనర్‌ పర్యటన

ABN , First Publish Date - 2021-07-25T05:16:37+05:30 IST

జీవీఎంసీ కమిషనర్‌ సృజన 96వ వార్డు పరిధి పెందుర్తిలో శనివారం పర్యటించారు. రహదారులు, డ్రైనేజీలు, విద్యుత్‌ తదితర అంశాలను పరిశీలించారు.

పెందుర్తిలో జీవీఎంసీ కమిషనర్‌ పర్యటన
సమస్యలు వింటున్న కమిషనర్‌ సృజన

పెందుర్తి, జూలై  24: జీవీఎంసీ కమిషనర్‌ సృజన 96వ వార్డు పరిధి పెందుర్తిలో శనివారం పర్యటించారు. రహదారులు, డ్రైనేజీలు, విద్యుత్‌ తదితర అంశాలను పరిశీలించారు. బీఆర్‌టీఎస్‌ రోడ్డు అధ్వా నంగా ఉండడాన్ని గమనించి పారిశుధ్య సిబ్బందిపై ఆమె మండి పడ్డారు. స్వీపింగ్‌ యంత్రాలతో రోడ్డును శుభ్రపరచాలని ఆదేశించారు. వార్డు కార్పొరేటర్‌ పీలా శ్రీనివాసరావు స్థానిక సమస్యలను కమిషనర్‌ దృష్టికి తెచ్చారు. పారిశుధ్య సిబ్బంది పనితీరు అధ్వానంగా ఉందని వివరించారు. విఽధులకు గైర్హాజరు అవుతున్న పారిశుధ్య సిబ్బందిపై చర్యలు చేపట్టని శానిటరీ కార్యదర్శి, ఏఎంహెచ్‌వోలపై కమిషనర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-07-25T05:16:37+05:30 IST