‘చంద్రబాబుపై దాడి దుర్మార్గం’

ABN , First Publish Date - 2021-04-14T06:20:23+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుపై తిరుపతిలో జరిగిన రాళ్ల దాడి వైసీపీ ఆరాచక పాలనకు పరాకాష్ట అని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, 69వ వార్డు కార్పొరేటర్‌ కాకి గోవిందరెడ్డి అన్నారు.

‘చంద్రబాబుపై దాడి దుర్మార్గం’
ఆందోళన చేస్తున్న గాజువాక టీడీపీ నాయకులు

గాజువాక, ఏప్రిల్‌ 13: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుపై తిరుపతిలో జరిగిన రాళ్ల దాడి వైసీపీ ఆరాచక పాలనకు పరాకాష్ట అని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, 69వ వార్డు కార్పొరేటర్‌ కాకి గోవిందరెడ్డి అన్నారు. చంద్రబాబుపై దాడికి నిరసనగా మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ఆరాచకాలను మానుకోవాలని, లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. కార్యక్రమంలో పార్టీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌, నాయకులు రమణ, రాజన్‌రాజు, నమ్మి అప్పారావు, బాలకృష్ణ, కొండబాబు, రమణ, శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-14T06:20:23+05:30 IST