క్షతగాత్రులకు హఫీజ్ సయీద్ కుమారుడి పరామర్శ
ABN , First Publish Date - 2021-06-24T15:54:14+05:30 IST
లాహోర్ నగరంలోని హఫీజ్ సయీద్ ఇంటి వద్ద బాంబు పేలుడు ఘటనలో గాయపడిన వారిని హఫీజ్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా...
లాహోర్ (పాకిస్థాన్): లాహోర్ నగరంలోని హఫీజ్ సయీద్ ఇంటి వద్ద బాంబు పేలుడు ఘటనలో గాయపడిన వారిని హఫీజ్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా పరామర్శించారు. హఫీజ్ తల్హా పాకిస్థాన్లో ఆసుపత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. ముంబై ఉగ్ర దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ జైలులో ఉండగా, అతని ఇంటికి సమీపంలో కారు బాంబు పేలింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా 21 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో సయీద్ ఇంటికి కాపలాగా ఉన్న పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు. హఫీజ్ సయీద్ ఇంటి కిటికీలు, గోడలు దెబ్బతిన్నాయి. ఈ పేలుడులో 30 కిలోల కంటే అధికంగా పేలుడు పదార్థాలు వినియోగించారని తేలింది.