మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న సివిల్‌ సప్లయీస్‌ కార్మికుల నిరవధిక సమ్మె

ABN , First Publish Date - 2021-02-25T04:17:27+05:30 IST

సివిల్‌ సప్లయీస్‌ కార్మికులకు 2020 జనవరి నుంచి పెరిగిన వేతనాలు చెల్లించాలని వారం రోజులుగా తాండూర్‌లో చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది.

మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న సివిల్‌ సప్లయీస్‌ కార్మికుల నిరవధిక సమ్మె
నినాదాలు చేస్తున్న సివిల్‌ సప్లయీస్‌ కార్మికులు

తాండూర్‌(బెల్లంపల్లి), ఫిబ్రవరి 24 : సివిల్‌ సప్లయీస్‌ కార్మికులకు 2020 జనవరి నుంచి పెరిగిన వేతనాలు చెల్లించాలని వారం రోజులుగా తాండూర్‌లో చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. బుధవారం శిబిరాన్ని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు,  నాయకులు లక్ష్మణ్‌, కొండుబానేష్‌ మాట్లాడారు. 14 నెలలుగా కొవిడ్‌ సమయంలో కూడా కరోనాను లెక్క చేయకుండా గ్రామాల్లో రేషన్‌ సరకులు సరఫరా చేశారని తెలిపారు. క్వింటాలు ఎగుమతి, దిగుమతికి రూ. 18 నుంచి 23 వరకు చార్జీలు పెంచారని చెప్పారు. వాటిని ప్రభుత్వం జీవో విడుదల చేసి ఎరియర్స్‌ రూపం లో చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు భూమయ్య, వెంకటేష్‌, రామయ్య, శంకర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T04:17:27+05:30 IST