హరితహారాన్ని విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2020-07-09T10:33:51+05:30 IST
హరితహారాన్ని విజయవంతం చేయాల ని రాష్ట్ర ప్రత్యేక పోలీసు 7వ బెటాలియన్ పోలీసులు ..
డిచ్పల్లి రూరల్, జూన్ 8: హరితహారాన్ని విజయవంతం చేయాల ని రాష్ట్ర ప్రత్యేక పోలీసు 7వ బెటాలియన్ పోలీసులు కమాండెంట్ సత్య శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో బుధవారం వెయ్యి మొక్కలు నాటారు. కార్య క్రమానికి జిల్లా ఆర్టీవో హితేష్ ముఖ్య అతిఽథిగా పాల్గొన్నారు. కార్యక్ర మంలో ఆర్ఐలు కోటయ్య, అనిల్కుమార్, మహేష్, నరేష్, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ధర్పల్లి: హరితహారంతో భావితరాలకు మనుగడ లభిస్తుందని ఎంపీపీ సారికారెడ్డి, సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాల్రాజ్ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని సబ్స్టేషన్ ఆవరణలో బుధవారం మొక్కలు నాటారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు హన్మంత్రెడ్డి, ఎంపీడీవో నటరాజ్, ఈవో నాగరాజు, ఏఈ శ్రీధర్ పాల్గొన్నారు.
నవీపేట (ఎడపల్లి): లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం హరిత హారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడపల్లి, ఒడ్డెపల్లి గ్రామాల మధ్యనున్న రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. కా ర్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ఇమ్రాన్ఖాన్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గంగారెడ్డి, మెర్సి శంకర్, వెంకట్రెడ్డి, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
కోటగిరి: గ్రామాల్లో నిర్మిస్తున్న వైకుంఠధామాల్లో హరితవనాన్ని తలపించేలా మొక్కలు నాటాలని ఎంపీడీవో అతారుద్దీన్ సూచించారు. మండలంలోని యాద్గార్పూర్ వైకుంఠధామంలో బుధవారం మొక్కలు నాటారు. కార్యక్రమంలో తహసీల్దార్ విఠల్, ఎంపీవో మారుతి, సర్పంచ్ విజయ, ఉప సర్పంచ్ ఆంజనేయులు, సాయన్న పాల్గొన్నారు.