నాన్ షెడ్యూల్ ఏరియాను ‘షెడ్యూల్’లో చేర్చాలి
ABN , First Publish Date - 2021-01-26T06:24:41+05:30 IST
నాన్ షెడ్యూల్ ఏరియాలోని గిరిజన గ్రామాలను షెడ్యూల్ ఏరియాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఇక్కడి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం అఖిల భారత వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి పి.ఎస్.అజయ్కుమార్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
వివిధ మండలాల గిరిజనుల ధర్నా
నర్సీపట్నం అర్బన్, జనవరి 25 : నాన్ షెడ్యూల్ ఏరియాలోని గిరిజన గ్రామాలను షెడ్యూల్ ఏరియాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఇక్కడి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం అఖిల భారత వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి పి.ఎస్.అజయ్కుమార్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ పరిధిలోని నాతవరం, గొలుగొండ, రోలుగుంట, రావికమతం మండలాల్లో గల ఆదివాసీ గ్రామాలను షెడ్యూల్ గ్రామాలుగా గుర్తించి, ఐటీడీఏలో విలీనం చేసేందుకు అధికారులు, పాలకులు కృషి చేయాలన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ మౌర్యకు వినతి పత్రం అందజేశారు. వివిధ మండలాల నుంచి గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.