ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు

ABN , First Publish Date - 2021-08-01T06:08:13+05:30 IST

ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు

ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు
వైద్య సిబ్బందికి సూచనలిస్తున్న జేడీ నిర్మజ గౌర్‌

  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ నిర్మజ గౌర్‌

గన్నవరం, జూలై 31 :  ఆరోగ్యం పట్ల అశ్ర ద్ధ వద్దని, ముఖ్యంగా సీజ నల్‌ వ్యాధులు విజృం భిస్తున్న తరుణంలో ప్రజ లను ఎప్పటికప్పుడు అప్ర మత్తం చేయాలని రాష్ట్ర  వైద్య ఆరోగ్య శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ నిర్మజ గౌర్‌ సిబ్బందిని ఆదేశించారు. ముస్తాబాద, సూరంపల్లి గ్రామా ల్లో శనివారం పర్యటించారు. ఇళ్లకు వెళ్లి స్థానికులతో మాట్లాడారు.  వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దోమల వ్యాప్తి వల్ల డెంగీ, మలేరియా, చికున్‌ గున్యా, మెదడు వాపు, బోధకా లు వ్యాధులు వస్తాయని, దోమల నివారణకు సమష్టిగా కృషి చేయాలన్నారు. సీజన్‌లో జ్వరాలు వస్తాయని అందరు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. వైద్య సిబ్బంది నిత్యం ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. మండల వైద్యాధికారిణి డాక్టర్‌ జె.సంధ్య, సూరంపల్లి సర్పంచ్‌ పులపాక బాబూరావు, హెల్త్‌ సూపర్‌ వైజర్‌ సాంబశివరావు, హెచ్‌వీ రాజ్యలక్ష్మి, హెచ్‌ఏ సాంబశివరావు, ఏఎన్‌ఎం హరిత, ఆశాలు రాణి, వీరమ్మ పాల్గొన్నారు.

ఫ డాక్టర్‌ టి.శివ ప్రసాద్‌ ఆధ్వర్యంలో సుగాలీపేట ఎంపీపీ పాఠశాలలో  శనివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 98 మందికి  వైద్య పరీక్షలు నిర్వహించారు. 

Updated Date - 2021-08-01T06:08:13+05:30 IST