dengue జ్వరాలు ప్రబలిన 9 రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ బృందాలు

ABN , First Publish Date - 2021-11-03T17:30:41+05:30 IST

దేశంలో డెంగీ జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేక కేంద్ర బృందాలను పంపించాలని నిర్ణయించింది...

dengue జ్వరాలు ప్రబలిన 9 రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ బృందాలు

సత్వర నివారణకు చర్యలు

న్యూఢిల్లీ : దేశంలో డెంగీ జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేక కేంద్ర బృందాలను పంపించాలని నిర్ణయించింది. హర్యానా, పంజాబ్, కేరళ, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, జమ్మూ అండ్ కశ్మీరు రాష్ట్రాల్లో డెంగీ జ్వరాలను అరికట్టేందుకు వీలుగా కేంద్ర ఆరోగ్యశాఖ నిపుణుల బృందాలను పంపనున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, జాతీయ అంటువ్యాధుల నివారణ కేంద్రాల నిపుణులను ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు.డెంగీ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ కేంద్ర నిపుణుల బృందం సాంకేతిక సూచనలు ఇవ్వనుంది. 


9 రాష్ట్రాల్లో డెంగీ నివారణపై సమీక్షించి దీని నివారణకు సత్వరం చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుక్ మాండవీయ అన్ని రాష్ట్రాల వైద్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శులను ఆదేశించారు. ఢిల్లీలో 1530 డెంగీ కేసులు వెలుగుచూశాయి. అక్టోబరు నెలలోనే అత్యధికంగా 1200 డెంగీ కేసులు నమోదయ్యాయి. 


Updated Date - 2021-11-03T17:30:41+05:30 IST