భూమిపూజను టీవీలో వీక్షించిన మోదీ తల్లి

ABN , First Publish Date - 2020-08-06T00:17:56+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో భూమిపూజ చేస్తుండగా ఆయన మాతృమూర్తి హీరాబెన్ మోదీ ఆ ఘట్టాన్ని..

భూమిపూజను టీవీలో వీక్షించిన మోదీ తల్లి

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో భూమిపూజ చేస్తుండగా ఆయన మాతృమూర్తి హీరాబెన్ మోదీ ఆ ఘట్టాన్ని టీవీలో వీక్షించారు. భూమిపూజ జరుగుతున్నంత సేపు చేతులు జోడించి శ్రద్ధగా తిలకించారు. నూరో సంవత్సరంలోకి అడుగుపెట్టిన హీరోబెన్ మోదీ అహ్మదాబాద్‌లోని తన నివాసం నుంచే ప్రత్యక్ష ప్రసారం ద్వారా భూమిపూజ చూసి పులకించిపోయారు. హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

Updated Date - 2020-08-06T00:17:56+05:30 IST