పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం
ABN , First Publish Date - 2021-10-15T05:59:46+05:30 IST
విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని ఎస్పీ సీహెచ్ విజయరావు తెలిపారు.
నెల్లూరు(క్రైం) అక్టోబరు 14: విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని ఎస్పీ సీహెచ్ విజయరావు తెలిపారు. ఈ ఏడాది జూలై 17న గూడూరు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ ఏఎస్సై ఎన్. సుబ్రహ్మణ్యం అనారోగ్యంతో మృతి చెందాడు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఆయన కుటుంబ సభ్యులకు భద్రతా ఎక్స్గ్రేషియా రూ.4లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కుటుంబ పెద్ద దిక్కు దూరమైతే ఆ కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో తనకు తెలుసనని, ధైర్యంగా ఉండాలని, ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్పీ పి.వెంకటరత్నం, సెక్షన్ సూపరింటెండెంట్ ఖతీజా బేగం, క్లర్క్ మాలకొండయ్య పాల్గొన్నారు.