డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి హెల్ప్లైన్ సెంటర్లు
ABN , First Publish Date - 2021-01-13T05:54:37+05:30 IST
డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి శ్రీకాకుళం (మహిళా), టెక్కలి, పాలకొండ, ఇచ్ఛాపురంలలోని డిగ్రీ కళాశాలల్లో హెల్ప్లైన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు శ్రీకా కుళం ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీరాములు ఒక ప్రకటనలో తెలిపారు.
గుజరాతీపేట: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి శ్రీకాకుళం (మహిళా), టెక్కలి, పాలకొండ, ఇచ్ఛాపురంలలోని డిగ్రీ కళాశాలల్లో హెల్ప్లైన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు శ్రీకా కుళం ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీరాములు ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం నుంచి ఈ నెల 17 వరకు ఈ హెల్ప్లైను కేంద్రాలు అందుబాటులో ఉంటాయన్నారు. సీటు పొందిన విద్యార్థులు ఈ నెల 21 నుంచి 23 వరకు ఆయా కళాశాలల్లో చేరాలని కోరారు.
18 నుంచి ట్రిపుల్ ఐటీ తరగతులు
ఎచ్చెర్ల: శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో పీయూసీ విద్యార్థులకు ఈ నెల 18 నుంచి తరగతులు నిర్వహించను న్నట్టు డైరెక్టర్ ప్రొఫెసర్ పి.జగదీశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్యాంపస్కు ఎంపికైన విద్యార్థులు ఆ రోజు ఉదయం 10 గంటలలోపు రిపోర్ట్ చేయాలన్నారు. సందేహాలు ఉంటే ఈ నెల 16 నుంచి 8885406407, 9441119945 నంబర్లను సంప్రదించాలని సూచించారు.