శిథిలావస్థలో పీహెచ్‌సీ సిబ్బంది క్వార్టర్స్‌

ABN , First Publish Date - 2021-05-08T07:40:23+05:30 IST

మండలంలోని కాకర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది క్వార్టర్స్‌ శిథిలావస్థకు చేరాయి. కొన్నేళ్లుగా వాటిలో ఎవ్వరూ ఉండకపోవడంతో నిరుపయోగంగా మారాయి.

శిథిలావస్థలో పీహెచ్‌సీ సిబ్బంది క్వార్టర్స్‌
నిరుపయోగంగా ఉన్న వైద్య సిబ్బంది భవనం

పట్టించుకోని అధికారులు 

మర్రిపూడి, మే 7 : మండలంలోని కాకర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది క్వార్టర్స్‌ శిథిలావస్థకు చేరాయి. కొన్నేళ్లుగా వాటిలో ఎవ్వరూ ఉండకపోవడంతో నిరుపయోగంగా మారాయి. 45 సంవత్సరాల క్రితం పొదిలి సమితి అధ్యక్షుడిగా గ్రామానికి చెందిన మెల్లల రామిరెడ్డి పని చేసిన సమయంలో కాకర్లకు పీహెచ్‌సీ మంజూరైంది. సువిశాలమైన ప్రాంగణంలో ఆరోగ్యకేంద్రంతోపాటు వైద్యాధికారులు, సిబ్బంది నివాసం ఉండేందుకు భవనాలు నిర్మించారు. కొద్దిరోజులపాటు సిబ్బంది అక్కడ నివాసమున్నారు. అనంతరం వాటిని వినియోగించకుండా వదిలి వేశారు. అధికారులు కూడా పట్టించుకోలేదు. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. చిల్లచెట్లు పెరిగి విషపురుగులు సంచరిస్తున్నాయి. ప్రస్తుతం రూ.1.70 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాల పనులు జరుగుతున్నాయి. ఇప్పుడైనా శిథిలావస్థకు చేరిన భవనాల స్థానంలో నూతన క్వార్టర్స్‌ నిర్మించాలని సిబ్బంది, ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2021-05-08T07:40:23+05:30 IST