దూసుకొస్తున్న గూడ్స్ రైలు.. పట్టాలపై మత్తులో తూలుతున్న ఇద్దరు యువకులు.. చివరకు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-09-07T19:31:44+05:30 IST

ఇద్దరు తాగుబోతులు రైల్వే స్టేషన్‌లో ఉన్న ప్రయాణీకులందరినీ టెన్షన్ పెట్టారు.. రైలు కింద పడబోయి చివరి నిమిషంలో తప్పించుకున్నారు..

దూసుకొస్తున్న గూడ్స్ రైలు.. పట్టాలపై మత్తులో తూలుతున్న ఇద్దరు యువకులు.. చివరకు ఏం జరిగిందంటే..

ఇద్దరు తాగుబోతులు రైల్వే స్టేషన్‌లో ఉన్న ప్రయాణీకులందరినీ టెన్షన్ పెట్టారు.. రైలు కింద పడబోయి చివరి నిమిషంలో తప్పించుకున్నారు.. బాగా తాగేసిన ఇద్దరు వ్యక్తులు స్టేషన్‌లోని రైల్వే ట్రాక్ మీద నిల్చుని వాదోపవాదాలు చేసుకున్నారు.. అదే సమయంలో ఓ గూడ్సు రైలు అదే ట్రాక్ మీద వేగంగా వస్తోంది.. చివరి నిమిషంలో ఒక వ్యక్తి తేరుకుని మరో వ్యక్తిని లాగేశాడు.. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.. బీహార్‌లోని బెగుసరాయ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


బెగుసరాయ్ రైల్వే స్టేషన్‌కు సోమవారం వచ్చిన ఇద్దరు తాగుబోతులు వేరే ప్లాట్‌ఫామ్ మీదకు వెళ్లేందుకు రైల్వే ట్రాక్ దాటాలనుకున్నారు. సరిగ్గా రైల్వే ట్రాక్ మీద రాగానే వారి మధ్య వాదనలు జరిగాయి. అక్కడ నిల్చుని ఇద్దరూ వాదించుకున్నారు. అదే సమయంలో వేగంగా ఓ గూడ్సు రైలు ఆ ట్రాక్ గుండా వస్తోంది. దీంతో స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు గట్టిగా కేకలు వేశారు. అయినా ఆ తాగుబోతులు పట్టించుకోలేదు. 


ఇద్దరూ వాదించుకుంటూ అదే ట్రాక్ మీద నిల్చున్నారు. రైలు దగ్గరకు వచ్చేసింది అనగా.. ఆ ఇద్దరు తాగుబోతుల్లో ఒకడు ట్రైన్‌ను చూశాడు. వెంటనే తను ట్రాక్ బయటకు వచ్చి రెండో వ్యక్తిని కూడా లాగేశాడు. దీంతో ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. అప్పటి వరకు టెన్షన్ అనుభవించిన స్టేషన్‌లోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే సిబ్బంది ఇద్దరినీ అదుపు లోకి తీసుకున్నారు. 



Updated Date - 2021-09-07T19:31:44+05:30 IST