మళ్లీ కళకళలాడనున్న పర్యాటక ప్రాంతాలు
ABN , First Publish Date - 2020-07-05T07:48:02+05:30 IST
లాక్డౌన్ కారణంగా మూడు నెలలుగా సందర్శకులు లేక వెలవెలబోయిన దేశంలోని పర్యాటక ప్రాంతాలు మళ్లీ కళకళలాడనున్నాయి. తాజాగా అన్లాక్ 2.0 లో పర్యాటక...
యాత్రికులను అనుమతించనున్న హిమాచల్ ప్రదేశ్, గోవా
న్యూఢిల్లీ, జూలై 4: లాక్డౌన్ కారణంగా మూడు నెలలుగా సందర్శకులు లేక వెలవెలబోయిన దేశంలోని పర్యాటక ప్రాంతాలు మళ్లీ కళకళలాడనున్నాయి. తాజాగా అన్లాక్ 2.0 లో పర్యాటక ప్రదేశాల్లో సందర్శకులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో హిమాచల్ ప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు యాత్రికుల కోసం ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే ఎప్పటి నుంచి యాత్రికులను అనుమతిస్తారనే విషయాన్ని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. కరోనా నెగెటివ్ రిపోర్టు ఉన్నవారినే అనుమతించనున్నట్లు హిమాచల్ ప్రదేశ్ స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా పరీక్షలు చేయించుకోకుండా వచ్చినా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని గోవా స్పష్టం చేసింది.