ఇళ్ల స్థలాలు సిద్ధం చేయండి
ABN , First Publish Date - 2020-12-04T04:53:20+05:30 IST
ఇళ్ల స్థలాలను సిద్ధం చేయాలని మండల అధికారులను జాయింట్ కలెక్టరు వెంకటరమణారెడ్డి ఆదేశించారు.
జాయింట్ కలెక్టరు వెంకటరమణారెడ్డి
ఉండి, డిసెంబరు 3: ఇళ్ల స్థలాలను సిద్ధం చేయాలని మండల అధికారులను జాయింట్ కలెక్టరు వెంకటరమణారెడ్డి ఆదేశించారు. ఎన్ఆర్పి.అగ్రహారం, పాము లపర్రు, వెలివర్రు, చెరుకు వాడ, ఉండి గ్రామాలలో ఇళ్ల స్థలాలను జేసీ వెంకట రమణారెడ్డి, సబ్ కలెక్టరు కె.విశ్వనాథన్ గురువారం పరిశీలించారు. పేదలకు ఇవ్వడానికి సిద్ధం చేసిన ఇళ్ల స్థలాల లే అవుట్ల విషయమై అధికారులకు సూచన లు ఇచ్చారు. ఇళ్ల స్థలాలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ సెంటర్స్పై సమీక్షించారు. పూడిక పనులు పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు కృష్ణజ్యోతి, ఎంపీడీవో గంగాదరరావు, ఈవోపీఆర్డీ కొండలరావు, రెవెన్యూ సిబ్బంది, గ్రామ కార్యదర్సులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
జడ్పీ సీఈవో పరిశీలన
ఆచంట, డిసెంబరు 3 : అర్హులందరికీ ఇళ్ల స్థలాలు అందజేసేందుకు పట్టాలు సిద్ధం చేయాలని జడ్పీ సీఈవో పి.శ్రీనివాసరావు అన్నారు. కొడమంచిలిలోని లే అవుట్లను, సచివాలయంతో పాటు పలు భవన నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈనెల 25న ఇచ్చే ఇళ్ల స్థలాలు పంపిణీలో భాగంగా లే అవుట్లను శుభ్రం చేసి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎంపీడీవో ఎన్.శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మూర్తిరాజు, గ్రామ కార్యదర్శి పాల్గొన్నారు.