భర్త అంత్యక్రియలు చేసిన భార్య
ABN , First Publish Date - 2021-05-12T05:09:06+05:30 IST
కుమారులు లేకపోవడంతో భర్తకు భార్యే అంత్యక్రియలు చేసిన ఘ టన తోటవూరులో చోటుచేసుకుం ది. గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి బైపల్లి వల్లభరావు(55) కిడ్నీ వ్యాధితో మంగళవారం మృతి చెందారు.
సోంపేట రూరల్: కుమారులు లేకపోవడంతో భర్తకు భార్యే అంత్యక్రియలు చేసిన ఘ టన తోటవూరులో చోటుచేసుకుం ది. గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి బైపల్లి వల్లభరావు(55) కిడ్నీ వ్యాధితో మంగళవారం మృతి చెందారు. ఈయనకు భార్య జేజేశ్వరి, నలుగురు కుమార్తెలు ఉన్నారు. దీంతో జేజేశ్వరీ గ్రామ స్థుల సహకారంతో భర్త అంత్యక్రియలు పూర్తిచేసింది.