పొద్దున్నే 5గంటలకు భార్య బయటకు వెళ్లడం చూసిన భర్తకు డౌట్.. వెనుకే వెళ్తే బస్టాండ్‌లో ఆమె నిర్వాకం చూసి..

ABN , First Publish Date - 2021-12-21T23:42:05+05:30 IST

జైపూర్‌లో ఓ భర్త.. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఓ రోజు పొద్దునే 5గంటలకు భార్య బయటకు వెళ్లడాన్ని చూసి వెనుకే వెళ్లాడు. తర్వాత భార్య నిర్వాకం చూసి ఏం చేశాడంటే..

పొద్దున్నే 5గంటలకు భార్య బయటకు వెళ్లడం చూసిన భర్తకు డౌట్.. వెనుకే వెళ్తే బస్టాండ్‌లో ఆమె నిర్వాకం చూసి..

అనుమానం పెనుభూతమై చివరకు సంసారాలే నాశనమవుతున్న.. వార్తలను తరచూ వింటూ ఉంటాం. కంటితో చూడకుండా చెప్పుడు మాటలు విని కొందరు భర్తలు.. భార్యలపై అనుమానం పెంచుకుంటూ ఉంటారు. అసలు విషయం తెలుసుకోకుండానే క్షణికావేశంలో దారుణాలకు పాల్పడుతూ ఉంటారు. అలాగే కొన్ని కుటుంబాల్లో భార్యలు కూడా భర్తలపై అనుమానం పెంచుకుంటూ ఉంటారు. జైపూర్‌లో ఓ భర్త.. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఓ రోజు పొద్దునే 5గంటలకు భార్య బయటకు వెళ్లడాన్ని చూసి వెనుకే వెళ్లాడు. తర్వాత భార్య నిర్వాకం చూసి ఏం చేశాడంటే.. 


రాజస్థాన్ జైపూర్‌లోని విశ్వకర్మ అనే ప్రాంతంలో కరణ్ అనే వ్యక్తి.. భార్య, మూడేళ్ల కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు. సంసారం సాఫీగా సాగిపోతున్న క్రమంలో కరణ్ భార్యకు ఢిల్లీకి చెందిన యోగేష్ అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆమెను కలవడానికి తరచూ జైపూర్ వస్తుండేవాడు. అలా వారి పరిచయం.. వివాహేతర సంబంధానికి దారితీసింది. కరణ్ పని మీద బయటికి వెళ్లగానే అతడి భార్య యోగేష్‌తో రాసలీలలు సాగించేది. కొన్నాళ్లు ఎవరికీ తెలీకుండా కలుసుకునేవారు. ఇటీవల కరణ్ కుమార్తె పుట్టిన రోజు ఉండగా.. రమ్మని ప్రియుడికి కబురు చేసింది. అయితే ఏవో పనులు ఉండి.. రాలేకపోయాడు.

వచ్చిన ప్రతీ పెళ్లి సంబంధానికి నో చెప్తున్న అక్క.. అర్థం చేసుకోకుండా తమ్ముడే ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు..!


మంగళవారం ప్రియురాలిని కలుసుకునేందుకు ఢిల్లీ నుంచి బస్సులో ఉదయం 5గంటలకు జైపూర్ బస్టాండ్‌లో దిగాడు. కరణ్ భార్యకు ఫోన్ చేసి రమ్మన్నాడు. దీంతో కరణ్‌కు తెలీకుండా ఆమె ఇంటి నుంచి బయలుదేరింది. అయితే అప్పటికే భార్యపై అనుమానం పెంచుకున్న కరణ్.. ఆమెకు తెలీకుండా తాను కూడా వెనుకే వెళ్లాడు. బస్టాండ్‌లో యోగేష్‌తో భార్యను చూసి షాక్ అయ్యాడు. కోపోద్రిక్తుడై భార్యను చితకబాదాడు. దీంతో అడ్డుకోబోయిన యోగేష్‌పై కత్తి తీసుకుని దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన యోగేష్.. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అనంతరం కరణ్.. అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న విశ్వకర్మ పోలీసులు అక్కడికి చేరుకుని, గాయపడ్డ యోగేష్‌ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

అతడి మీదకు అమాంతం దూకేసిన సింహం.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..

Updated Date - 2021-12-21T23:42:05+05:30 IST