హుజురాబాద్ నామినేషన్లను పరిశీలిస్తున్న అధికారులు
ABN , First Publish Date - 2021-10-11T17:30:02+05:30 IST
కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక పోటీ కోసం దాఖలైన అభ్యర్థుల నామినేషన్లను...
కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక పోటీ కోసం దాఖలైన అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు సోమవారం పరిశీలిస్తున్నారు. మొత్తం 61 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన తర్వాత వారిలో ఎందరు మిగులుతారన్న ఆసక్తి నెలకొంది. అనేక అడ్డంకులను అధిగమించి 15 మంది ఫీల్డు అసిస్టెంట్లు నామినేషన్లు దాఖలు చేశారు. స్క్రూటీనిలో ఎందరు ఊడతారో.. ఎవరు బరిలో నిలుస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 13న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అభ్యర్థుల చివరి జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు.