HYD: ఉద్యోగం పేరుతో రూ.11 లక్షల మోసం

ABN , First Publish Date - 2021-08-01T17:31:39+05:30 IST

విదేశాల్లో ఉద్యోగం పేరుతో నగరవాసి నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.11 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన నాగమల్లేశ్వరరావు విదేశాల్లో..

HYD: ఉద్యోగం పేరుతో రూ.11 లక్షల మోసం

హైదరాబాద్/హిమాయత్‌నగర్‌: విదేశాల్లో ఉద్యోగం పేరుతో నగరవాసి నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.11 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన నాగమల్లేశ్వరరావు విదేశాల్లో సివిల్‌ ఇంజనీర్‌ ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో అన్వేషిస్తున్నాడు. ఆన్‌లైన్‌లో పరిచయం పెంచుకున్న సైబర్‌ నేరగాడు న్యూజిలాండ్‌లో సివిల్‌ ఇంజనీర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. అనంతరం పలుదఫాలుగా రూ.11లక్షలు ఆన్‌లైన్‌లో బదిలీ చేయించుకున్నాడు. డబ్బులు ఇచ్చి ఎంతకాలమైనా ఉద్యోగం రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్‌ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2021-08-01T17:31:39+05:30 IST