తస్మాత్ జాగ్రత్త.. Hyderabad లోని ఈ ఏరియాలో భారీ గుంత.. మేల్కోకుంటే ముప్పే!
ABN , First Publish Date - 2021-09-06T17:40:03+05:30 IST
రోడ్డు క్రాస్ చేసే సమయంలో పొరపొటున అందులో పడితే...
హైదరాబాద్ సిటీ/హయత్నగర్ : జీహెచ్ఎంసీ హయత్నగర్ డివిజన్ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను హరించేలా ఉంది. పద్మావతి కాలనీలో రోడ్డు పక్కనే ట్రంకు లైను కుంగి నెల రోజుల క్రితం ఓ గుంత ఏర్పడింది. దాన్ని పూడ్చకపోవడంతో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అది పెద్ద గోతిలా మారిపోయింది. రోడ్డు క్రాస్ చేసే సమయంలో పొరపొటున అందులో పడితే అంతే సంగతి అని కాలనీ సంక్షేమ సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.