HYDలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్

ABN , First Publish Date - 2022-02-01T13:47:21+05:30 IST

నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపుతోంది.

HYDలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్

హైదరాబాద్: నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. నాంపల్లిలోని ఆగపురకు చెందిన షేక్ గుయోష్ పాషా(60) అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఆగంతకులు కిడ్నాప్ చేశారు. గత అర్ధరాత్రి 12:10 గంటలకు నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కింగ్ కోటి ఈడెన్ గార్డెన్ వద్ద ఘటన చోటు చేసుకుంది. నిన్న ఈడెన్ గార్డెన్స్‌లో వివాహానికి హాజరై తిరిగి ఇంటికి వెళుతుండగా.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కారులో పాషాను ఎక్కించుకొని కిడ్నాప్ చేశారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. షేక్ గుయోష్ పాషా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2022-02-01T13:47:21+05:30 IST