HYD : హైదరాబాద్ మహిళతో తమిళనాడు వ్యక్తికి వివాహేతర సంబంధం.. కొద్దిరోజులుగా..!
ABN , First Publish Date - 2021-10-21T13:49:13+05:30 IST
ఎల్బీనగర్ డివిజన్ పరిధిలో అద్దెకు ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. అతడికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది....
హైదరాబాద్ సిటీ : తనతో ఉన్న వివాహేతర సంబంధాన్ని అడ్డం పెట్టుకుని రూ.5 లక్షలు డిమాండ్ చేసి, వేధిస్తున్న నిందితుడిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీ మహేష్ భగవత్ వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన కబిలియన్ ఎల్బీనగర్ డివిజన్ పరిధిలో అద్దెకు ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. అతడికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసుకునేవాడు. ఏడాది క్రితం కబిలియన్ తమిళనాడుకు వెళ్లిపోయాడు.
కొద్దిరోజులుగా గుర్తుతెలియని నంబర్ నుంచి మహిళకు ఫోన్లు, వాట్సాప్ మెసేజ్లు చేస్తున్నాడు. రూ.5లక్షలు ఇవ్వాలని, లేదంటే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. సీపీ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు డీసీపీ క్రైమ్స్ యాదగిరి, ఏసీపీ హరినాథ్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ శంకర్ రంగంలోకి దిగి, తమిళనాడు వెళ్లూరు భారతీనగర్లో ఉన్న నిందితుడు కబిలియన్ అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.