గట్టుప్పలలో ఐసీఎంఆర్ బృందం పర్యటన
ABN , First Publish Date - 2021-06-23T06:59:36+05:30 IST
చండూరు మండలం గట్టుప్పలలో మంగళవారం ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ బృందం పర్యటించింది. గ్రామంలో ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో, మళ్లీ తగ్గడం తో గ్రామాన్ని ఎంపిక చేసినట్లు బృందం సభ్యు లు తెలిపారు.
రక్త నమూనాలు సేకరించిన సభ్యులు
చండూరు, జూన్ 22: చండూరు మండలం గట్టుప్పలలో మంగళవారం ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ బృందం పర్యటించింది. గ్రామంలో ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో, మళ్లీ తగ్గడం తో గ్రామాన్ని ఎంపిక చేసినట్లు బృందం సభ్యు లు తెలిపారు. ఎంపిక చేసిన కుటుంబాల్లోని 43 మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 70 జిల్లాల్లో పర్యటిస్తున్నామని, పర్యటనలో భాగంగా 10,20,40,60 ఏళ్ల వయస్సు వారి నుంచి రక్తనమూనాలు సేకరిస్తు న్న ట్లు వివరించారు. ఇందులో కరోనా వచ్చిన వారు, వైరస్ను జయించిన వారు, రాని వారి నుంచి రక్త నమూనాలు సేకరించి చెన్నై లోని ఇండియా ల్యాబ్కు పంపించనున్నట్లు వివరించారు. గ్రామానికి వచ్చిన ఐసీఎంఆర్ బృందానికి జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, గ్రామ సర్పంచ్ ఇడెం రోజా స్వాగతం పలికి వివరాలు వెల్లడించారు. డాక్టర్ బి.రాఘవేంద్ర నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో పీహెచ్సీ డాక్టర్ బి.శ్రీనివాసులు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.