అంత్యక్రియలకు సాయం చేస్తే రూ. 50 వేలిచ్చారు

ABN , First Publish Date - 2020-08-05T11:44:40+05:30 IST

కరోనాతో చనిపోయిన ఒక వృద్ధుడు అంత్యక్రియలకు సహకరించిన వ్యక్తికి అధికారులు అక్షరాలా రూ. 50 వేలు ఇచ్చారు. 100 రామన్నపాలెం గ్రామానికి ..

అంత్యక్రియలకు సాయం చేస్తే రూ. 50 వేలిచ్చారు

టి.నరసాపురం : కరోనాతో చనిపోయిన ఒక వృద్ధుడు అంత్యక్రియలకు సహకరించిన వ్యక్తికి అధికారులు అక్షరాలా రూ. 50 వేలు ఇచ్చారు.  100 రామన్నపాలెం గ్రామానికి చెందిన వృద్ధుడు (70) సోమవారం జంగారెడ్డిగూడెంలో కొవిడ్‌ 19 పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించడానికి సిద్ధ్దపడుతుండగా అకస్మాత్తుగా మృతిచెందాడు. ఆ వృద్ధుడి అంత్యక్రియలకు అతని కుమారుడు ఎవరిని సాయం అడిగినా భయపడి ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన దాకారపు సత్యనారాయణ ముందుకొచ్చారు. పంచాయతీ సిబ్బంది సాయంతో కుమారుడితో అంతిమ సంస్కారాలు నిర్వహించినట్టు ఎంపీడీవో కె.పి.కామేశ్వరి తెలిపారు. ఈ మేరకు మండల పరిషత్‌, పంచాయతీ నుంచి రూ. 50 వేలు సత్యనారాయణకు చెల్లించారు. 

Updated Date - 2020-08-05T11:44:40+05:30 IST