ఐఎఫ్ఎస్ ట్రెయినీకి కరోనా వైరస్ పాజిటివ్
ABN , First Publish Date - 2020-03-30T12:02:56+05:30 IST
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) ట్రెయినీకి కరోనా వైరస్ సోకిన ఘటన...
డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్): ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) ట్రెయినీకి కరోనా వైరస్ సోకిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ నగరంలో వెలుగుచూసింది. ముగ్గురు ఐఎఫ్ఎస్ ట్రెయినీలకు కరోనా వైరస్ లక్షణాలున్నాయని వారిని పరీక్షించగా ఒకరికే కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కరోనా వైరస్ సోకిన ఐఎఫ్ఎస్ ట్రెయినీని ఐసోలేషన్ గదికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గతంలో కరోనా బారిన పడిన మరో ఐఎఫ్ఎస్ ట్రెయినీ కోలుకోవడంతో అతన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఐఎఫ్ఎస్ ట్రెయినీకి కరోనా సోకడంతో డెహ్రాడూన్ నగరంలోని శిక్షణ కేంద్ర భవనాన్ని శానిటైజ్ చేశారు.