టీడీపీ నాయకులపై అక్రమ కేసులు దారుణం

ABN , First Publish Date - 2021-01-26T05:51:33+05:30 IST

రామతీర్థంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై చెప్పులు విసిరిన ఘటనకు సంబంధించి టీడీపీ సీనియర్‌ నాయకుడు సువ్వాడ రవిశేఖర్‌, మరికొందరు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారని ఆ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి ఆరోపించారు.

టీడీపీ నాయకులపై అక్రమ కేసులు దారుణం
ఆసుపత్రి వద్ద నిరసన తెలుపుతున్న వనజాక్షి, తదితరులు

తెలుగు మహిళా అధ్యక్షురాలు వనజాక్షి

విజయనగరం, జనవరి 25: రామతీర్థంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై చెప్పులు విసిరిన ఘటనకు సంబంధించి టీడీపీ సీనియర్‌ నాయకుడు సువ్వాడ రవిశేఖర్‌, మరికొందరు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారని ఆ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి ఆరోపించారు. ఈ కేసులో రిమాండ్‌లో ఉంటూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవిశేఖర్‌ ఆరోగ్యం కుదుటపడక ముందే వైద్యులపై ఒత్తిడి చేసి డిశ్చార్జ్‌ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె మండిపడ్డారు. పోలీసుల తీరుకు నిరసనగా ఆమె పార్టీ కార్యకర్తలతో కలిసి సోమవారం పెద్దాసుపత్రి ఎదుట నినాదాలు చేశారు. రవిశేఖర్‌ ఆరోగ్యం విషయంలో ఎలాంటి అపశృతి జరిగినా పోలీసులే బాఽద్యులన్నారు.  

 


Updated Date - 2021-01-26T05:51:33+05:30 IST