గొండ్యాలపుట్టుగలో ఆకట్టుకున్న నవదుర్గల ప్రదర్శన

ABN , First Publish Date - 2021-10-15T04:56:48+05:30 IST

మండలంలోని గొండ్యాలపుట్టగలో భూలో కమాత అమ్మవారి శరన్న వరాత్రులు పురస్కరించుకొని బుధవారం ఏర్పాటు చేసిన నవదుర్గల ప్రదర్శన ఆకట్టుకుంది.

గొండ్యాలపుట్టుగలో ఆకట్టుకున్న నవదుర్గల ప్రదర్శన
కవిటి: గొండ్యాలపుట్టుగలో నవదుర్గల ప్రదర్శన

కవిటి: మండలంలోని గొండ్యాలపుట్టగలో భూలో కమాత అమ్మవారి శరన్న వరాత్రులు పురస్కరించుకొని బుధవారం ఏర్పాటు చేసిన నవదుర్గల ప్రదర్శన ఆకట్టుకుంది. నటరాజ్‌ డ్యాన్స్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో   తొమ్మిది మంది వేషధారణలు అలరించాయి.ఫ పలాస: జంటపట్టణాల్లోని బాబా మందిరంలో షిర్డీ సాయిబాబా మహా సమాధి చెందిన విజయదశమి పురస్కరించుకొని గురువారం వెయ్యి తామరపూలతో అభిషేకం చేశారు. శుక్రవారం అన్నాభిషేకం నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతుందని మందిర కమిటీ తెలిపింది. 24 గంటల పాటు ఓంసాయి శ్రీసాయి జయ జయసాయిఏకనామ కీర్తన జరుగుతుందని పేర్కొంది.ఫ పలాస రూరల్‌:మాకన్నపల్లిలో దసరా ఉత్స వాలు పురస్కరించుకొని   యువజన సంఘం ఆధ్వర్యంలో  కోలాటం,పగటివే షాలు  నిర్వహించారు.ఫఆమదాలవలస: చిట్టివలసలో  దేవీనవరాత్రులు పురస్కరించు   అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. దేవీ పూజలే, అన్న సంతర్పణ కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ విఫ్‌ కూన రవికుమార్‌  పాల్గొన్నారు.




Updated Date - 2021-10-15T04:56:48+05:30 IST