ఆకట్టుకున్న శివార్చన

ABN , First Publish Date - 2022-03-01T06:43:29+05:30 IST

మహాశివరాత్రి జాతర ఉత్సవాల సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ఆవరణలో నిర్వహిస్తున్న శివార్చన సాంస్కృతిక కార్యక్రమం ఆకట్టుకుంది.

ఆకట్టుకున్న శివార్చన
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఎమ్మెల్యే, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌

వేములవాడ, ఫిబ్రవరి 28 : మహాశివరాత్రి జాతర ఉత్సవాల సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ఆవరణలో నిర్వహిస్తున్న శివార్చన సాంస్కృతిక కార్యక్రమం ఆకట్టుకుంది. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ వి.అనిల్‌కుమార్‌, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, జిల్లా అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ సోమవారం రాత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజన్న క్షేత్రంలో శివార్చన కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. అనంతరం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ వి.అనిల్‌కుమార్‌ వయోలిన్‌ ప్లే చేయడం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రమాదేవి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆర్‌.మాధవి, ఆలయ పునరుద్ధరణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-03-01T06:43:29+05:30 IST