రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి
ABN , First Publish Date - 2021-05-15T06:47:00+05:30 IST
తాడేపల్లిగూడెం సమీపంలోని మెయిన్ బైపాస్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందగా, కుమారుడు తీవ్ర గాయాలకు గురయ్యాడు.
కుమారుడికి తీవ్ర గాయాలు
తాడేపల్లిగూడెం రూరల్, మే 14: తాడేపల్లిగూడెం సమీపంలోని మెయిన్ బైపాస్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందగా, కుమారుడు తీవ్ర గాయాలకు గురయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం నల్లజర్ల మండలం కొత ్తపేటకు చెందిన తాడిపత్రి నారాయణరెడ్డి (50), తన కుమారుడు దుర్గా ప్రసాద్ బంధువుల ఇంటికి మోటారు సైకిల్పై అలంపురం వచ్చి తిరిగి ఇంటికి బయ ల్దేరారు. మార్గమధ్యంలో జాతీయ రహదారిపై పెదతాడేపల్లి వద్ద రోడ్డు దాటు తుండగా వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొంది. దీంతో వీరు తీవ్ర గాయా లకు గురికాగా వెంటనే 108లో తాడేపల్లిగూడెం ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే నారాయణరెడ్డి మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఎన్. శ్రీనివాసరావు తెలిపారు.