విలీనం చేయవద్దని వినతి

ABN , First Publish Date - 2021-10-23T06:09:41+05:30 IST

కొమరగిరిపట్నం ప్రాథమిక పాఠశాలను స్థానిక న్యాపతి సుబ్బారావు పంతులు జడ్పీ హైస్కూల్‌లో విలీనం చేయవద్దని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.

విలీనం చేయవద్దని వినతి

అల్లవరం, అక్టోబరు 22: కొమరగిరిపట్నం ప్రాథమిక పాఠశాలను స్థానిక న్యాపతి సుబ్బారావు పంతులు జడ్పీ హైస్కూల్‌లో విలీనం చేయవద్దని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. పాఠశాల పేరెంట్స్‌ కమిటీ ఆధ్వర్యంలో ఎంపీడీవో జీవీ సరోవర్‌, ఎంఈవో కె.కిరణ్‌బాబులకు విద్యార్థుల తల్లిదండ్రులు వినతిపత్రాలు అందజేశారు. హైస్కూల్‌లో పాఠశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ కొద్దిసేపునిరసన తెలిపారు. 


Updated Date - 2021-10-23T06:09:41+05:30 IST