పెరిగిన కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-10-21T11:50:25+05:30 IST
జిల్లాలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. సోమవారం 120 కేసులు నమోదు కాగా.. మంగళవారం రెండింతలు పెరిగి 240 కేసులు నమోదయ్యాయి
కొత్తగా 240 మందికి వైరస్ నిర్ధారణ
54,678కు చేరిన మొత్తం కేసుల సంఖ్య
51,928 మంది డిశ్చార్జ్
చికిత్స పొందుతూ మరొకరి మృతి
463కు చేరిన మొత్తం మరణాలు
విశాఖపట్నం, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. సోమవారం 120 కేసులు నమోదు కాగా.. మంగళవారం రెండింతలు పెరిగి 240 కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మొత్తం కేసులు 54,678కు చేరాయి. వీరిలో వైరస్ నుంచి కోలుకుని 51,928 మంది డిశ్చార్జ్ కాగా, మరో 2287 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ మంగళవారం మరొకరు మృతి చెందగా, మొత్తం కొవిడ్ మరణాలు 463కు చేరాయి.
98వ వార్డులో మూడు..:
సింహాచలం గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో 98వ వార్డుకు చెందిన 44 మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్గా నిర్ధారణ అయింది.
ఆరిలోవలో ఒకటి..:
ఆరిలోవ రిఫరల్ ఆస్పత్రిలో 42 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్గా నిర్ధారణ అయింది.