ఈ నెల 6న భారత్ - చైనా మధ్య ప్రారంభం కానున్న చర్చలు

ABN , First Publish Date - 2020-06-04T00:13:32+05:30 IST

భారత్ - చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై ఈ నెల 6న ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలకు

ఈ నెల 6న భారత్ - చైనా మధ్య ప్రారంభం కానున్న చర్చలు

న్యూఢిల్లీ : భారత్ - చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై ఈ నెల 6న ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలకు మిలటరీ స్థాయిలో ఉన్న ఉన్నతాధికారుల మధ్యే చర్చలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. భారత్ చైనా సరిహద్దుల్లోని చుసుల్ - మోల్దో ప్రాంతంలో ఇరు దేశాల మిలటరీ ఉన్నతాధికారులు చర్చించనున్నారు. భారత్ తరపున లెఫ్టినెంట్ జరనల్ హరీందర్ సింగ్ ప్రాతినిధ్యం వహించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాంతీయ స్థాయి కమాండర్లతో ఇరు దేశాల మధ్య చర్చలు జరగడం ఇదే ప్రథమం. 

Updated Date - 2020-06-04T00:13:32+05:30 IST