బ్రిటన్లో పెరిగిన భారతీయ విద్యార్థులు
ABN , First Publish Date - 2020-02-28T08:38:12+05:30 IST
బ్రిటన్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2019 విద్యా సంవత్సరంలో విద్యా (టైర్-4) వీసాలు పొందిన భారతీయ విద్యార్థుల సంఖ్య 37,500కి చేరుకుంది. అంతకు ముందు ఏడాదితో....
బ్రిటన్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2019 విద్యా సంవత్సరంలో విద్యా (టైర్-4) వీసాలు పొందిన భారతీయ విద్యార్థుల సంఖ్య 37,500కి చేరుకుంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 93 శాతం ఎక్కువ. గత ఎనిమిదేళ్లలో ఇంత మంది విద్యార్థులకు వీసాలు లభించటం కూడా ఇదే మొదటిసారి. దీంతోపాటు యూకేలో నైపుణ్య వీసా కేటగిరిలో (టైర్-2) 57 వేల కన్నా ఎక్కువ మంది భారతీయుల ఉద్యోగులు టైర్-2 వీసాను పొందారు. మొత్తం టైర్-2 వీసాల్లో ఇది 50 శాతం పైనే. వీటితో పాటు బ్రిటన్ పర్యాటక వీసాల సంఖ్య కూడా బాగా పెరిగింది. నిరుడు 5.15 లక్షల మందికి టూరిస్టు వీసాలు లభించాయి. 2018తో పోలిస్తే ఇది 8 శాతం అధికం. - స్పెషల్ డెస్క్