ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మృతి
ABN , First Publish Date - 2020-02-28T11:13:20+05:30 IST
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం నవజాత శిశువు మృతి చెందింది. బంధువులు
కామారెడ్డిటౌన్, ఫిబ్రవరి 27: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం నవజాత శిశువు మృతి చెందింది. బంధువులు తెలి పిన వివరాల ప్రకారం.. రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన ప్రేమలత అనే గర్భిణీ బుధవారం డిలివరీ కోసం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లింది. స్కానింగ్ తీసిన వైద్యులు బిడ్డ పరిస్థితి బాగా లేదని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. బుధవారం రాత్రి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు నార్మల్ డిలివరీ అవుతుందని చెప్పారు. కానీ ఆపరేషన్ చేయాలని కుటుంబీకులు వైద్యులను కోరారు.
అయినా గురువార ం మధ్యాహ్నం వరకు నార్మల్ డెలవరీ కోసం చూస్తూ వైద్యులు కాలయాప న చేశారు. అనంతరం నార్మల్ డిలివరీ అయినా మగ బిడ్డ పుట్టగానే మృతి చెందింది. పసికందు మృతికి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని బంధువులు, కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరిటెండెంట్ను వివరణ కోరగా ఆసుపత్రికి వచ్చాక గర్భిణికి అన్ని పరీక్షలు నిర్వహించామని తెలిపారు. కడుపులో బిడ్డ కండిషన్ బాగా లేదని బంధువులకు తెలిపి డెలవరీ నిర్వహించామన్నారు. అంతే కానీ ఎక్క డ కూడా అలసత్వం వహించలేదని వివరించారు.