అగ్నిప్రమాదంలో కార్మికుడికి గాయాలు

ABN , First Publish Date - 2021-01-21T06:22:29+05:30 IST

స్థానిక గ్రోత్‌సెంటరులోని ఫెర్రో ఎల్లాయీస్‌ పరిశ్రమలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ కార్మికుడికి గాయాలయ్యా యి.

అగ్నిప్రమాదంలో కార్మికుడికి గాయాలు

బొబ్బిలి, జనవరి 20: స్థానిక గ్రోత్‌సెంటరులోని ఫెర్రో ఎల్లాయీస్‌ పరిశ్రమలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ కార్మికుడికి గాయాలయ్యా యి. జార్ఖండ్‌కు చెందిన తుపాంగ్‌ సింగ్‌ బుధవారం పరిశ్రమలో ట్యాపింగ్‌ చేస్తుండగా ప్రమాదం సంభవించడంతో వీపు పూర్తిగా కాలిపోయింది. అలాగే ముఖం, ఇతర శరీరభాగాలుకూడా కాలిపోయాయి. గాయపడిన కార్మికుడిని స్థానిక సీహెచ్‌సీలో ప్రాథమిక చికిత్స చేసి, అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

Updated Date - 2021-01-21T06:22:29+05:30 IST