వెంకటాద్రి ఆలయంలో ఆభరణాల తనిఖీ
ABN , First Publish Date - 2021-07-30T04:45:51+05:30 IST
పెందుర్తి వెంకటాద్రి శిఖరంపై గల వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం వేంకటేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన వెండి, బంగారు ఆభరణాలు తనిఖీ చేశారు.
పెందుర్తి జూలై 29: పెందుర్తి వెంకటాద్రి శిఖరంపై గల వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం వేంకటేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన వెండి, బంగారు ఆభరణాలు తనిఖీ చేశారు. స్వామివారికి నిత్య అలంకరణలు చేసే ఆభరణాలతో పాటు బ్యాంకు లాకర్లలో భద్రపరిచిన బంగారు, వెండి ఆభరణాలు తనిఖీ చేశారు. ఆలయ ప్రాంగణంలో జేఈవో ప్రసాద్ పర్యవేక్షణలో ఆలయ అధికారులు రిజస్టర్ పరిశీలించారు. బ్యాంకు లాకర్లలో ఉన్న ఆభరణాలు రిజిస్టర్లో నమోదైన బంగారు, వెండి ఆభరణాల వివరాలు సరిపోల్చారు. ఇందులో ఎటువంటి వ్యత్యాసం లేకపోవడంతో స్వామివారి ఆభరణాల వివరాలు వెల్లడించారు. ఆలయ ఈవో బండారు ప్రసాద్, ఆలయ అర్చకులు మహర్తి రామానుజాచార్యులు పాల్గొన్పారు.