వానల్‌పాడ్‌లో ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన

ABN , First Publish Date - 2021-07-30T06:00:59+05:30 IST

వానల్‌పాడ్‌ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు.

వానల్‌పాడ్‌లో ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన
అమ్మవారి విగ్రహానికి పూజలు చేస్తున్న భక్తులు

భైంసా రూరల్‌, జూలై 29 :  వానల్‌పాడ్‌ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. ముత్యాలమ్మ దీవెనలు అందరిపై ఉండాలని ఎంపీపీ కల్పనజాదవ్‌ అన్నారు. గురువారం మండలంలోని ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గ్రామస్ధులు, ఆలయకమిటీ సభ్యులు ఎంతో కృషి చేసి నూతన ఆలయం నిర్మించడం అభి నందనీయమన్నారు. గ్రామాల్లో అమ్మవారు ఉండడం వల్ల అందరికీ మంచి జరుగుతుందన్నారు. ముత్యాలమ్మ గ్రామ ప్రజలను చల్లంగా చూడాలన్నారు. గత మూడు రోజులుగా వేద పండితులు యజ్ఞాలు, తదితర పూజలు నిర్వ హించారన్నారు. ప్రతిష్టాపన మహోత్సవానికి గ్రామస్తులతో పాటు చుట్టు పక్కల గ్రామాల భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ పెద్ద రాజన్న, నాయకులు గణేష్‌ పటేల్‌, రామ్‌కుమార్‌, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్ధులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-30T06:00:59+05:30 IST