ఇంటర్ ప్రవేశ పరీక్షలకు 278మంది హాజరు
ABN , First Publish Date - 2021-07-30T04:26:12+05:30 IST
మండలంలోని రామచంద్రాపురం బాలయోగి గురుకుల కళాశాలలో ఇంటర్ ప్రవేశ పరీక్షలకు 278మంది విద్యార్థినులు హాజరైనట్లు కళాశాల ప్రిన్పిపాల్ పద్మశ్రీ తెలిపారు.
బుచ్చిరెడ్డిపాళెం, జూలై 29: మండలంలోని రామచంద్రాపురం బాలయోగి గురుకుల కళాశాలలో ఇంటర్ ప్రవేశ పరీక్షలకు 278మంది విద్యార్థినులు హాజరైనట్లు కళాశాల ప్రిన్పిపాల్ పద్మశ్రీ తెలిపారు. కళాశాలలో గురువారం ఇంటర్ ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలకు 316మందికి గాను 278మంది విద్యార్థినులు హాజరైనట్లు తెలిపారు. పరిమిత సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులను అనుమతించారు. మిగిలిన వారంతా రోడ్డుమీద వాహనాల్లో కొంతమంది, చెట్ల నీడన సేదతీరారు. దీంతో కళాశాలతో పాటు పరిసర ప్రాంతాల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో సందడి వాతావరణం నెలకొంది.
ప్రవేశ పరీక్షకు 28మంది గైర్హాజరు
తోటపల్లిగూడూరు : మండలంలోని కోడూరు బాలికల గురుకులంలో గురువారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రవేశ పరీక్షకు 28మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారు. గురుకులంలో జూనియర్ ఇంటర్మీడియట్ ప్రవేశ పరీక్షకు మొత్తం 162 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరిలో 28మంది గైర్హాజరు కాగా 134 మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. గురుకులం ప్రిన్సిపాల్ సుజ్జలత పర్యవేక్షణలో ప్రవేశ పరీక్ష జరిగింది. మండల విద్యాశాఖ అధికారి సన్నారెడ్డి వేణుగోపాల్రెడ్డి పరీక్ష ప్రక్రియను పర్యవేక్షించారు. అబ్జర్వర్గా స్వర్ణశ్రీ వ్యవహరించారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరిగింది.