ఇద్దరు సామాజిక కార్యకర్తలకు మధ్యంతర బెయిల్

ABN , First Publish Date - 2020-08-04T20:07:52+05:30 IST

మధ్యంతర బెయిల్‌పై విడుదలైన ఇద్దరు కార్యకర్తలు తమ ఆదేశాలను పాటించాలని కోర్టు అభిప్రాయపడింది. అంతే కాకుండా బిహార్ ప్రభుత్వానికి కూడా సుప్రీం కోర్టు నోటీసులు పంపింది.

ఇద్దరు సామాజిక కార్యకర్తలకు మధ్యంతర బెయిల్

న్యూఢిల్లీ: బిహార్‌లోని అరారియాలో ఓ యువతి అత్యాచార కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన ఇద్దరు సామాజిక కార్యకర్తలకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. కేసు విచారణ సమయంలో కోర్టు చర్యలకు అడ్డు తలుగులుతున్నారనే కారణంతో వీరిని కొంత కాలంగా జైలులో ఉంచారు. అయితే మధ్యంతర బెయిల్‌పై విడుదలైన ఇద్దరు కార్యకర్తలు తమ ఆదేశాలను పాటించాలని కోర్టు అభిప్రాయపడింది. అంతే కాకుండా బిహార్ ప్రభుత్వానికి కూడా సుప్రీం కోర్టు నోటీసులు పంపింది.

Updated Date - 2020-08-04T20:07:52+05:30 IST