ఐఎస్‌ఎఫ్‌హెచ్‌ఏఎల్‌టీ కమిటీకి డాక్టర్‌ సందీప్‌ అత్తావర్‌ ఎంపిక

ABN , First Publish Date - 2021-07-30T04:53:36+05:30 IST

అవయవ మార్పిడి గైడ్‌లైన్స్‌ సూచించే ఇంటర్నేషనల్‌ సొసైటీ ఫర్‌ హార్ట్‌ అండ్‌ లంగ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ (ఐఎ్‌సఎ్‌ఫహెచ్‌ఏఎల్‌టీ)

ఐఎస్‌ఎఫ్‌హెచ్‌ఏఎల్‌టీ కమిటీకి డాక్టర్‌ సందీప్‌ అత్తావర్‌ ఎంపిక
డాక్టర్‌ సందీప్‌ అత్తావర్‌

హైదరాబాద్‌ సిటీ, జూలై 29 (ఆంధ్రజ్యోతి): అవయవ మార్పిడి గైడ్‌లైన్స్‌ సూచించే ఇంటర్నేషనల్‌ సొసైటీ ఫర్‌ హార్ట్‌ అండ్‌ లంగ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ (ఐఎ్‌సఎ్‌ఫహెచ్‌ఏఎల్‌టీ) కమిటీకి కిమ్స్‌ ఆస్పత్రి డాక్టర్‌ సందీప్‌ అత్తావర్‌ ఎంపికయ్యారు. ఈ కమిటీలో ఉన్న 24 మంది ప్రముఖ ఊపిరితిత్తుల మార్పిడి నిపుణులలో ఆసియా ఖండం మొత్తంలోనే ఏకైక గుండె, ఊపిరితిత్తుల మార్పిడి నిపుణుడిగా ఆయన నిలిచారు. ఈ సందర్భంగా డాక్టర్‌ అత్తావర్‌ మాట్లాడుతూ ఈ గౌరవం దక్కినందుకు సంతోషంగా ఉందన్నారు. కిమ్స్‌ ఆస్పత్రి ఎండీడాక్టర్‌ భాస్కర్‌రావు మాట్లాడుతూ డాక్టర్‌ అత్తావర్‌, ఆయన బృందం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని, ఊపిరితిత్తులు పాడైన వారికి కొత్త జీవితం అందిస్తున్నారని చెప్పారు.  

Updated Date - 2021-07-30T04:53:36+05:30 IST