ఇంటింటా ఫీవర్ సర్వే
ABN , First Publish Date - 2021-05-10T06:01:52+05:30 IST
జిల్లా కేంద్రంలోని 48 వార్డుల్లో ఆదివారం వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో ఇంటింటా ఫీవర్ సర్వే కార్యక్రమాన్ని నిర్వ హించారు.
జగిత్యాల టౌన్, మే 9 : జిల్లా కేంద్రంలోని 48 వార్డుల్లో ఆదివారం వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో ఇంటింటా ఫీవర్ సర్వే కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా కరోనా లక్షణాలతో పాటు ఇతర సమస్యలతో ఉ న్నవారిని వైద్య సిబ్బంది గుర్తించి వివరాలు నమోదు చేశారు. కరోనా విజృం భిస్తున్న సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్ర మంలో అన్ని వార్డుల కౌన్సిలర్లు, ఆశా, అంగన్వాడీ, ఏఎన్ఎమ్లు పా ల్గొన్నారు.