మొర్రిగుడని సందర్శించిన ఐటీడీఏ పీవో
ABN , First Publish Date - 2022-01-27T05:30:00+05:30 IST
మండలంలోని గసబా పంచాయతీ మొర్రిగుడ గ్రామంలో పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ గురువారం పర్యటించారు.
డుంబ్రిగుడ, జనవరి 27: మండలంలోని గసబా పంచాయతీ మొర్రిగుడ గ్రామంలో పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా అతిసార బాధిత కుటుంబాలను పరామర్శించారు. అతిసార ప్రబలడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఉన్న తాగునీటి పమండలంలోని గసబా పంచాయతీ మొర్రిగుడ గ్రామంలో పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ గురువారం పర్యటించారు. ఈఽథకాలను పరిశీలించారు. గ్రామస్థులు తాగుతున్న నీటిని పరీక్షించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి, సాధారణ పరిస్థితులు వచ్చే వరకు వైద్య సేవలందించాలని ఆదేశించారు. కేజీహెచ్ నుంచి వైద్యాధికారులను రప్పించి పూర్తి అధ్యయనం చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఎంహెచ్వో డాక్టర్ లీలాప్రసాధ్, ఎంపీడీవో కె.భాగ్యారావు, తహసీల్దార్ త్రినాథ్, తదితరులు పాల్గొన్నారు.