అటవీ హక్కుల వివరాలు నమోదు చేయండి

ABN , First Publish Date - 2020-11-26T06:24:44+05:30 IST

ఏజెన్సీలో లబ్ధిదారులకు అందించిన అటవీ హక్కుల వివరాలను గిరి భూమి పోర్టల్‌లో నమోదు చేయాలని ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ ఆదేశించారు.

అటవీ హక్కుల వివరాలు నమోదు చేయండి
వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌

ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌ 


పాడేరు, నవంబరు 25: ఏజెన్సీలో లబ్ధిదారులకు అందించిన అటవీ హక్కుల వివరాలను గిరి భూమి పోర్టల్‌లో నమోదు చేయాలని ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ ఆదేశించారు. ఏజెన్సీలోని 11 మండలాల రెవెన్యూ అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానంగా అటవీ హక్కుల కల్పనపై మూడోసారి నిర్వహించిన డివిజన్‌ స్థాయి సమావేశంలో  ఆమోదం పొందిన హక్కుల లబ్ధిదారుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదన్నారు. రెవెన్యూ అధికారులు దీనిపై ప్రత్యేక ప్రత్యేక శ్రద్ధ కనబరచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 

Updated Date - 2020-11-26T06:24:44+05:30 IST